కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా కొనసాగుతున్న వలసలు
- బి ఆర్ ఎస్ పార్టీ నుంచి ఇద్దరు ఎంపీటీసీ లు,ఒక మహిళ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
ముద్ర.కొల్లాపూర్:- కొల్లాపూర్ మండల పరిధిలోని ఎల్లురు గ్రామ ఎంపీటీసీ సోమిశెట్టీ మంజుల శేఖర్, రామాపురం గ్రామ ఎంపీటీసీ వరలక్ష్మిరామ్ చందర్, మరియు కొల్లాపూర్ మున్సిపాలిటీ కి చెందిన 11 వ వార్డ్ కౌన్సిలర్ బోరెల్లి కరుణ మహేష్ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలో కొల్లాపూర్ లో బి ఆర్ ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.కొల్లాపూర్ నియోజకవర్గం జూపల్లి నాయకత్వం లోనే అభివృద్ది పథంలో ముందుకు వెళ్తుందని,గత పాలకులు అభివృద్ది నీ గాలికి వదిలేసి ప్రజలను ఇబ్బందులు పెట్టారని పార్టీ లో చేరిన వారన్నారు.అందుకే జూపల్లి నాయకత్వాన్ని బలపర్చెందుకు కాంగ్రెస్ పార్టీలో చేరానని వారు తెలిపారు. కార్యక్రమంలో కొల్లాపూర్ మండల,పట్టణ ప్రస్తుత,మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.