వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త

స్టేషన్ ఘన్ పూర్, ముద్ర: భార్య కాపురానికి రాకపోగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందన్న బాధతో తాళ్లపల్లి రాజు అనే వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యా యత్నం చేసిన సంఘటన చిన్న పెండ్యాల లో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి రాజు - మంజులకు 20 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. వారి వైవాహిక జీవితంలో ఇద్దరు కొడుకుల జన్మనిచ్చారు.

అక్కడి వరకు సాఫీగా సాగిన సంసారంలో గత రెండేళ్లుగా కలహాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మంజుల మహిళా పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేసింది. కేసు పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్కు రావాలని పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు రావడంతో అవమానంగా భావించిన రాజు వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. సకాలంలో చిల్పూర్ పోలీసులు వాటర్ ట్యాంక్ ఎక్కి రాజు ను చాకచక్యంగా కిందికి దింపారు.