మహా సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

మహా సభ వాల్ పోస్టర్ల ఆవిష్కరణ

రామకృష్ణాపూర్,ముద్ర : ఈ నెల 21 న ఆర్కేపి బ్రాంచ్ కార్యాలయంలో జరగబోయే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ 12 వ మహా సభలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బ్రాంచ్ కార్యదర్శి అక్బర్ అలీ పిలుపునిచ్చారు. శుక్రవారం  ఆర్కేపి ఓపెన్ కాస్ట్ అవరణలో సభకు సంబంధించిన వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింగరేణి కార్మికుల 11వ వేజ్ బోర్డు ఏరియర్స్,లాభాల వాటా,కాంట్రాక్టీకరణ,హై పవర్ వేతనాలు,ఉద్యోగ భద్రత, కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటలు, కొత్త గనులు సాధించుకునేందుకే సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు లింగయ్య,ఫిట్ కార్యదర్శి ఆంజనేయులు, మైనింగ్ స్టాఫ్ ఇంచార్జ్ రాజేశ్వర్ రావు, సి.హెచ్.పి ఇంచార్జ్ కార్యదర్శి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.