కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకేంద్రంలోని కాకతీయ ప్రెస్ క్లబ్ లో మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగా యి. కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రెస్ క్లబ్ కన్వీనర్ నాగపురి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు రాచర్ల ప్రభాకర్ ల చేతుల మీదుగా జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం స్వీట్లు పంచి, వేడుకలను కన్నుల పండుగగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులందరూ ఐకమత్యంగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమానికి జర్నలిస్టులందరూ సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు సామంతుల శ్యామ్, సామల శ్రీనివాస్, క్యాతం సతీష్, జల్ది రమేష్, బెల్లం తిరుపతి, పావుశెట్టి శ్రీనివాస్, తడుక సుధాకర్, బండ మోహన్, కొంకుల సాంబయ్య, బెల్లం శ్రీనివాస్ ఎడ్ల సంతోష్, వడ్లూరు సతీష్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.