తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలు అయినాయి

తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలు అయినాయి
  • ఆ అయోమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు
  • అమలుకు సాధ్యం కానీ మేనిఫెస్టో అని ఆనాడే చెప్పాము
  • కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420
  • ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది
  • కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయింది
  • గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీ  ని అటకెక్కించింది
  • ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సభబు కాదు
  • తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది
  • వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారు
  • ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయడం సాధ్యం కాదు
  • బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి భావన
  • కాంగ్రెస్ పరిపాలన గొప్పతనం పై  ప్రజలలో చర్చ మొదలైంది

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:- తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే  బిఆర్ఎస్ పార్టీ ను రద్దు చేయమనడం కాంగ్రెస్ కు సభబు కాదని, మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన ఆయన తనదైన కాంగ్రెస్ పార్టీ నేతలనుఎండగట్టారు.బిఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తే తమని ప్రశ్నించేవారు ఉండరనేదే వారి  ఉద్దేశ్యంలా ఉందని ఆరోపించారు.తాము 420 గాళ్లమని వాళ్లకు వాళ్లే చెప్పుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది అనీ,వాళ్ల దొంగతనాన్ని వాళ్లే బయట పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ పరిపాలన గొప్పతనం పై  ప్రజలలో చర్చ మొదలైందని, ఇది కేవలం ఆరంభం మాత్రమే అన్నారు. పథకాల అమలుకు ప్రభుత్వంగా సమయం తీసుకుంటే తప్పులేదు కానీ,ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయాలని చూస్తే సాధ్యం కాదన్నారు.తెలిసీ, తెలియక ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీకి గుదిబండలా మారాయని అన్నారు. అధికారంలోకి వచ్చేది ఉందా సచ్చేది ఉందా అన్న రీతిలో  ఎవరో రాసిచ్చిన హామీలను చదివి , అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఆ అయోమయంలోనే  పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారనీ అన్నారు.

ఎన్నికల సమయంలోనే కాంగ్రెస్ పార్టీ ది అమలుకు సాధ్యం కానీ మ్యానిఫెస్టో అని  చెప్పామని జగదీష్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అక్షరాల 420 ఉన్నాయన్న ఆయన ఆ హామీలను ప్రజలకు చెప్పే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోయిందని ప్రజలు చర్చుకుంటున్నారని  అన్నారు.గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామన్న కాంగ్రెస్ ఆ హామీ  ని అటకెక్కించి, ప్రజల నుండి ముక్కు పిన్ని డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. పైగా బిల్లు చెల్లించకపోతే వచ్చేనెల రెట్టింపు అవుతుంది అన్న రీతిలో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పరిపాలన చేతకాకపోతే అనుభవిజ్ఞుల సహాయం తీసుకొని ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.