జె.జె నగర్ కాలనీ వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

జె.జె నగర్ కాలనీ వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు పట్టించుకోని అధికారులు

చిలుకూరు, ముద్ర: మండల కేంద్రంలోని జె.జె నగర్ కాలనీ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన బట్టల వ్యాపారి ధర్మేందర్ గా గుర్తించారు. హుజూర్నగర్ నుండి కోదాడ వెళుతుండగా బైక్ ను AP07 TN 0499 నెంబర్ గల సిమెంట్ ట్యాంకర్ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినారు. జె.జె నగర్ కాలనీ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న  ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోవడం లేదని పలుమార్లు ధర్నాలు చేసి వినతి పత్రాలు ఇచ్చిన కనీస స్పందన లేదని పిల్లలు పెద్దలు రోడ్డు దాటుటకు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని దాటవలిసిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు వాపోతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదం జరగడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.