శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ దంపతులు

శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్మన్ దంపతులు

జోగులంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల జిల్లా కేంద్రంలోని బుర్దపేట అయ్యప్ప స్వామి దేవస్థానం నందు జగదీష్ శివ స్వామి ఆధ్వర్వంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం మున్సిపల్ చైర్మన్ దంపతులు బి.యస్. కళావతి కేశవ్, మహా శివుని శివనామ స్మరణతో స్వామి వారికీ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు చైర్మన్ దంపతులకు మహా మంగళహారతి తీర్ద ప్రసాదాలు స్వీకరించి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కలను చెల్లించుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ కేశవ్ మాట్లాడుతూ.. గద్వాల పట్టణ ప్రజలు అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. మహా శివరాత్రి రోజున స్వామి వారి ఉపవాస దీక్ష లో పట్టణ ప్రజలు అందరూ భక్తితో స్వామిని కొలిచి మీ కోరికలు నెరవేరాలని అని ప్రజాలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడుని కోరుకున్నట్లు అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు.