ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా కేబిఆర్ గౌడ్...

ఓబీసీ జిల్లా అధ్యక్షుడిగా కేబిఆర్ గౌడ్...

ముద్ర ప్రతినిధి, మహబూబ్నగర్: మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఓబిసి జిల్లా అధ్యక్షుడిగా కే.రాజా బాలచందర్ గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ శనివారం ప్రకటించారు. ఈ సందర్భంగా కే. బాలచందర్ గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పార్టీ ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర పార్టీ నాయకత్వానికి జిల్లా పార్టీ నాయకత్వానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవి బాధ్యతలు అప్పగించినందుకుగాను జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పార్టీ విజయానికి శాయ శక్తుల కృషి చేస్తానని కేబీర్ గౌడ్ తెలిపారు.