బండి సంజయ్ కి కీలక బాధ్యతలు

బండి సంజయ్ కి కీలక బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ను బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమస్తూ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకుంది. 8 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులుగా, 12 మంది జాతీయ ఉపాధ్యక్షులను నియమిస్తూ బిజెపి కీలక ప్రకటన విడుదల చేసింది. దీంతో తెలంగాణ నుండి బండి సంజయ్ తో పాటు డీకే అరుణ ను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది.