కేటీఆర్ పర్యటన… ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్ 

కేటీఆర్ పర్యటన… ప్రతిపక్షాల ముందస్తు అరెస్ట్ 

ముద్ర ప్రతినిధి, వరంగల్ : హన్మకొండ, వరంగల్ లో శుక్రవారం మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేస్తున్నారు. ఉదయమే బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ నివాసానికి పోలీసులు చేరుకున్నారు. వారిని బయటకు వెళ్లకుండా నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా పోలీసుల తీరు పై వారు మండిపడ్డారు. కేటీఆర్ వస్తే ముందస్తు అరెస్ట్ లు చేసే బదులు వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ 144 సెక్షన్ పెడితే అయిపోతుందన్నారు. అభివృద్ధి పనులు చేయటానికి వచ్చే మంత్రి ప్రతిపక్ష నాయకులను ముందస్తు అరెస్టు చేయడానికి ఏంటని   నిలదిశారు. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ, ఓవర్ హాలింగ్ అండ్ మెయిన్టెనెన్స్ వర్క్ షాపు పై కేటీఆర్ తప్పకుండా స్పందించాలని డిమాండ్ చేశారు. ఓరుగల్లు అనేక సమస్యలతో సతమతమవుతుందని ప్రశ్నిస్తే భయంతోనే ముందస్తుగా అర్థం పర్థం లేని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.