కోదాడ మండలంలో మరో కూలీల ఆటో బోల్తా

కోదాడ మండలంలో మరో కూలీల ఆటో బోల్తా
  • ఆటోలో 14 మంది కూలీలు

ముద్ర ప్రతినిధి , కోదాడ:-కోదాడ మండలం చిమిర్యాల క్రాస్ రోడ్ వద్ద మిరప కూలీల ఆటో బోల్తా పడింది . స్పీడ్ బ్రేకర్ వద్ద సడన్ బ్రేక్ వెయ్యడంతో , ఆటో లో పరిమితికి మించి ఉండటంతో ప్రమాదం జరిగింది . ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నారు . చిమిర్యాలకి చెందిన కూలీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అనుమంచిపల్లికి మిరప చేలలో కూలీలకు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో ఆటోలో 14 మంది కూలీలు ఉన్నారు . ప్రమాదంలో గాయపడిన ముగ్గురు కూలీలను కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం సూర్యాపేట ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం .