భూ సేకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

భూ సేకరణ పనులు సత్వరం పూర్తి చేయాలి  జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్

ముద్ర ప్రతినిధి, వనపర్తి :భూ సేకరణ ఇతర అభివృద్ధి పనులు సత్వరం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఐడీఓసీలో భూసేకరణ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు అలాగే పానగల్ గణపురం మండలాలలోని కాలువల గురించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కాలువల పరిస్థితి నీటి విడుదల తదితర అంశాలపై చర్చించారు. ఇంకా రేవల్లిలో పునరావాస కేంద్ర ఇళ్ల స్థలాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డిఓ పద్మావతి, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ సత్య శీలారెడ్డి అధికారులు పాల్గొన్నారు.