మాజీ మంత్రికి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక 

మాజీ మంత్రికి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరిక 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్: వికారాబాద్ జిల్లా వికారాబాద్ పట్టణం, మద్గుల్ చిట్టంపల్లి ,బంటారం మండలం లోని సల్బత్తాపూర్ గ్రామానికి చెందిన వివిధ పార్టీలకి సంబందించిన కార్యకర్తలు, నాయకులు మంగళ వారం వికారాబాద్ లో మాజీ మంత్రి  గడ్డం ప్రసాద్ కుమార్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ లోకి చేరడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం లో భారీ విజయం సాధిస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలను అధికారం చెప్పటనున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నెరవేర్చి పేదలు, మహిళలు ,రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.