మణిపూర్ ఘటన పై వామపక్షాల నిరసన

మణిపూర్ ఘటన పై వామపక్షాల నిరసన

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మణిపూర్ లో మహిళ పట్ల జరిగిన ఘటనను నిరసిస్తూ సీపీఐ, సీపీఎం ఆందోళన చేపట్టాయి. మంగళవారం ఐ బీ చౌరస్తా వద్ద  నిరసన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంను బర్తరఫ్ చేయాలని వామ పక్ష నేతలు డిమాండ్ చేశారు. మహిళకు జరిగిన అన్యాయం ప్రజాస్వామ్యంకు గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. దోషులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అన్నారు. ఈకార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కళవేన శంకర్, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, ఏఐ టీయూసీ నాయకుడు మేకల దాసు, సీపీఎం నాయకులు రవి, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.