లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను విజయవంతం చేయండి

లంబాడాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ ఉత్సవాలను విజయవంతం చేయండి
  • ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు  జయపాల్ నాయక్

తుంగతుర్తి ముద్ర:-ఈ నెల 1Oవ తేదీన తుంగతుర్తి మండల కేంద్రంలో ని సిరి ఫంక్షన్ హాల్లో జరగబోయే శ్రీ సంత్ సద్గురు  సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలనీ ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జయపాల్  నాయక్ పిలుపునిచ్చారు. మంగళవారం తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని  అంబేద్కర్ విగ్రహం ఎదుట జయంతి వేడుకలను పురస్కరించుకొని గిరిజన సంఘం నాయకులతో కలిసి చలో తుంగతుర్తి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్బంగా జయపాల్ నాయక్ మాట్లాడుతూ...అడవి బిడ్డల ప్రత్యేకమైన ప్రకృతి ఆరాధన, ఆధ్యాత్మిక దృక్పథం, సామాజిక సాంస్కృతిక జీవన విధానాన్ని కాపాడడం కోసం వారు చేసిన కృషి గొప్పదనీ ఆయన సేవలు కొనియాడారు.

తన ప్రజలను బయట ప్రపంచం నుంచి అనుక్షణం రక్షించుకునే దిశగా సంతు సేవాలాల్ మహారాజ్ జీవితాంతం పోరాటం సాగించారన్నారు. బంజారాలకు స్ఫూర్తి ప్రదాతగా నాటి కాలంలో వారు చేసిన కృషి విశ్వవ్యాప్తంగా ఉన్న బంజారాలకు వారిని ఆధ్యాత్మిక గురువుగా తమ ఆరాధ్య దైవంలా కొలిచేలా చేసిందని అన్నారు.మొట్ట మొదటి సారిగా మండల కేంద్రంలో జరుగుతున్న ఈ జయంతి కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న  గిరిజనులు,ప్రజాప్రతినిధులు,గిరిజన ఉద్యోగులు,యువతి, యువకులు ఇతర ప్రజాప్రతినిధులు,బంజారా కవులు, కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్య ఫౌండేషన్ మండల అధ్యక్షులు అంబటి రాములు, ఆరాధ్య ఫౌండేషన్ ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు నాగు నాయక్, జిల్లా అధ్యక్షులు వెంకన్న నాయక్, నియోజకవర్గ అధ్యక్షులు సోమ్లా నాయక్, జిల్లా నాయకులు ధారాసింగ్, వెంకన్న, కిషన్ నాయక్, నూతనకల్ అధ్యక్షుడు శ్రీకాంత్ నాయక్, తిరుమలగిరి అధ్యక్షుడు కిట్టు నాయక్,తో పాటు సీనియర్ నాయకులు హేమ నాయక్, ధారాసింగ్,లింగ నాయక్ తదితర గిరిజన సంఘం నాయకులు పాల్గొన్నారు.