యువకుడి చికిత్స కోసం మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ,విల్స్ క్రికెట్ అసోసియేషన్ చేయూత - లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేత

యువకుడి చికిత్స కోసం మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ,విల్స్ క్రికెట్ అసోసియేషన్ చేయూత - లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేత

మోత్కూర్(ముద్ర న్యూస్): మోత్కూర్ మున్సిపల్ కేంద్రానికి చెందిన కాసర్ల దీపక్ రెడ్డి హైదరాబాదులో ప్రైవేట్ ఉద్యోగం చేస్తుండగా ఆఫీసుకు వెళ్తున్న సమయంలో ప్రమాదవశాత్తు బైక్ పై నుండి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ కావడంతో మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ ను ఆశ్రయించగా దాతల సహకారంతో అందించిన 50,000 వేల రూపాయలు , విల్స్ క్రికెట్ అసోసియేషన్ యూత్ సభ్యులు అందించిన 50 వేల రూపాయలు నగదు మొత్తం రూ. 1లక్ష రూపాయలు యువకుడి తండ్రి రవీందర్ రెడ్డి కి సోమవారం స్వయంగా అందజేశారు. వందలాది కుటుంబాలకు మన మోత్కూర్ వాట్సాప్ గ్రూప్ గత నాలుగు సంవత్సరాలలో  ఆపద సమయంలో రూ. 25 లక్షల పైచిలుకు ఆర్థిక సహకారాలు అందించడం అభినందనీయమని వాట్సాప్ గ్రూప్ జిల్లాలోనే  సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉన్నట్లు తెలిపారు.

రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయాలు అందించడంలో మన మోత్కూర్ వాట్సప్ గ్రూపు మరింత ముందుండాలని ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ సభ్యులు దబ్బేటి సోంబాబు, కారుపోతుల వెంకన్న ,పన్నాల శ్రీనివాస్ రెడ్డి, కోమటి మచ్చ గిరి,  జడ్ పి హెచ్ఎస్ ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఇండ్ల రాంప్రసాద్ ,పిఆర్ టియూ అధ్యక్షులు గాదె వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ సంస్థ ఉపాధ్యక్షుడు ముప్ప వెంకటరెడ్డి ,కార్యదర్శి మెట్టు మంగేష్, ఓయూ జేఏసీ రాష్ట్ర నాయకులు మర్రి అనిల్ కుమార్, కారుపోతుల శ్రీనివాస్,ఎడ్ల శ్రీను, ఎండి రఫీ, డి ప్రణీత్, ఈదునూరి కృష్ణ, కరుణాకర్ ,ఇర్ఫాన్, రమేష్, మొరిగాల శీను, జి నాగరాజు,బయ్యని గిరి, రాజేష్, బాబురావు ,నల్ల కుమార్,హరీష్,నాగరాజు,సంతోష్,మచ్చగిరి, తదితరులు పాల్గొన్నారు.