వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి మావో ల లేఖ..

వరద బాధితులను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి మావో ల లేఖ..

వరంగల్: తెలంగాణ ప్రభుత్వానికి మావోయిస్టు జేఎండబ్ల్యూపీ (JMWP) డివిజన్ కమిటీ లేఖ రాసింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదు కోవాలని లేఖలో కోరింది. ఈ మేరకు మావోయిస్టు జేఎండబ్ల్యూపీ (JMWP) డివిజన్ కమిటీ లేఖ రాసింది..

లేఖ లోని ప్రధాన అంశాలు: అత్యంత భారీ వర్షంతో కొండాయి, మోరంచపల్లి జల దిగ్బంధంలో చిక్కుకుని చనిపోయిన వారందరికీ బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఇల్లు, రూ. 10 లక్షల రూపాయులు వెంటనే చెల్లించాలి..

జూలై 27న వచ్చిన అత్యంత భారీ వర్షంతో ములుగు, భూపాలపల్లి జిల్లాలను అతలాకుతలం చేసింది..

భారీ వర్షాలతో వరదలు వచ్చి వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తూ కుంటలు, చెరువులు తెగి పోవడంతో కొండాయి, దొండ్ల, మల్యాల, ప్రాజెక్టు నగర్, బూర్గు పేట, మోరంచపల్లి తో సహా చాలా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కు కోవడంతో ప్రజలంతా అర్తనాదాలు, అహాకారాలు, అరణ్య రోదనలతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ గడిపారు..

కొండాయిలో 8 మంది, మోరంచపల్లి లో నలుగురు, ప్రాజెక్టు నగర్‌ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు, బూర్గు పేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో సహా లెక్క లోకి రాని వారు మరికొందరు వరదలో కొట్టుకు పోయి చనిపోయారు..

బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రచార ఆర్భాటాలు చేసింది కానీ ముందస్తుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా బాధ్యతా రహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరించింది..

భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి.

ఈ వరదలతో తెగిన కుంటలను, చెరువులను వెంటనే పునరుద్ధరించాలి..

జంపన్న వాగు, మోరంచ వాగు, చలి వాగు పాటు అనేక వాగులు పక్కన ఉన్న పంట పొలాల్లో వేసిన ఇసుక మేటలను తీయడానికి ప్రభుత్వమే ఎకరాకు రూ. లక్ష వెంటనే ఇవ్వాలి..

వరదలకు తెగిన రోడ్లను, వంతెన లను వెంటనే పునరుద్ధరించాలి..

వర్షాలతో వాతావరణం కలుషితమై మలేరియా తో పాటు అన్ని రకాల జబ్బులకు వెంటనే మెడికల్ క్యాంపులు పెట్టి వైద్యం అందించాలి..

మరో పంట కోసం అన్ని రకాల విత్తనాలను ప్రభుత్వం వెంటనే ఇవ్వాలి..