గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం.. భారీగా చేరికలు..

గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం.. భారీగా చేరికలు..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ :  స్థానిక ఎమ్మెల్యే  మర్రి జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో వినూత్న తరహాలో విస్తృతంగా గ్రామాలలో పర్యటిస్తున్నారు గురువారం నియోజకవర్గంలోని తెలకపల్లి  మండలం పర్వతాపురం, గౌరారం గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రచారానికి అడుగడుగున నీరాజనం పలుకుతున్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామాలలో పర్యటిస్తూ పది సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ మళ్ళీ ఆశీర్వదించండి అండగా ఉండడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ నిధులతో పాటు సొంత నిధులను కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయడం జరుగుతుందని నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దాడం జరిగిందని తెలిపారు. మహాత్మా గాంధీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యాన్ని తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రెండు పర్యాయాలుగా విజయం సాధించి చేపట్టిన అభివృద్ధి సంక్షేమం ప్రజలకు కనిపించడం వల్ల ఎన్నికల ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తన విజయాన్ని ఆపలేరని అన్నారు కొందరు నాయకులు ప్రలోభాలకు ఆర్థిక అవసరాల కోసం పార్టీలు మారిన తనకు వచ్చే నష్టమేమీ లేదని ప్రజల అండ కొండంత ఉందని అన్నారు.. కష్టకాలంలో కరోనా టైంలో ఈ లీడర్లు మీకు కనిపించారా ఒక్కసారి ఆలోచించండి  కష్ట కాలంలో మీకు తోడుగా ఉండే నాయకున్ని ఎంచుకోండి. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బై కాని శ్రీనివాస్ యాదవ్, నాగం శశిధర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నేతలు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు...