అయ్యప్పస్వామి ఆలయానికి రూ. 12.50 లక్షలు అందజేసిన మేఘారెడ్డి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయ అభివృద్ధి కోసం పెద్దమందడి ఎంపీపీ తూడి మేఘారెడ్డి రు.12.50 లక్షలు విరాళంగా అందజేశారు. ఆలయ కమిటీ విజ్ఞప్తి మేరకు అయ్యప్ప స్వామి దేవాలయ ఆవరణ తోపాటు వీర మరకత లింగేశ్వర స్వామి ఆవరణలో రాజస్థాన్ మార్బుల్స్ వెయ్యడం కోసం 12 లక్షల 50 వేల రూపాయలు ఆలయానికి అందజేసినట్లు ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బి నగేష్, ముత్తు కృష్ణ, కుప్పి రెడ్డీ, అశోక్ రెడ్డీ గురుస్వామి తెలిపారు. దీనిలో భాగంగా కమిటీ అధ్యక్షులు నగేష్, కోశాధికారి ప్రతాపరెడ్డి, కార్యదర్శి గట్టు వెంకన్న, కె, నాగరాజు రాజస్థాన్ వెళ్లి మార్బుల్స్ తీసుకొచ్చినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధి కోసం విరాళం అందజేసిన ఎంపీపీ మెగా రెడ్డిగారికి కి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు