గద్దె రాగడిలో వ్యాపారి హత్య

గద్దె రాగడిలో వ్యాపారి హత్య

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : మంచిర్యాల జిల్లా క్యాథనపల్లి పురపాలక సంఘం పరిధిలోని గద్దె రాగడిలో మంచిర్యాల వ్యాపారి నడిపెళ్లి లక్ష్మీకాంతారావు దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఆయన హత్య గురై రక్తపు మడుగులో పడి ఉన్నారు. హత్యకు కారణం భూ తగాదాలేనని తెలిసింది. మృతునికి మంచిర్యాల లో కమర్షియల్ కాంప్లేక్స్ ఉంది. ఇటీవలనే బెల్లంపల్లి చౌరస్తా లోని బార్ షాపును కొనుగోలు చేశాడు. కొద్దిరోజుల్లో ప్రారంభోత్స వంకు ఏర్పాట్లు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడు. రామకృష్ణాపూర్ పోలీస్ లు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.