భైంసా లో అర్ధ రాత్రి పోలీసు తనిఖీలు.. పరిస్థితులు ఉద్రిక్తం.. పలువురికి గాయాలు

భైంసా లో అర్ధ రాత్రి పోలీసు తనిఖీలు.. పరిస్థితులు ఉద్రిక్తం.. పలువురికి గాయాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బైంసాలో మంగళవారం అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ ఘటనలో బిజెపి కార్యకర్తలకు పోలీసులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ముథోల్  బిజెపి అభ్యర్థి రామారావు పాటిల్ సమీప బంధువు ఇంట్లో మంగళవారం అర్ధరాత్రి పోలీసులు తనిఖీల పేరుతో ప్రవేశించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సమాచారం లేకుండా ఇంట్లోకి ప్రవేశించారంటూ బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీరి మధ్య జరిగిన తోపులాటలో కొంతమంది పోలీసులకు, బిజెపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసు అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.