ఇసుక డంప్ ల పై మైనింగ్ అధికారుల దాడులు
![ఇసుక డంప్ ల పై మైనింగ్ అధికారుల దాడులు](https://mudranews.in/uploads/images/2023/06/image_750x_64788e09bac4e.jpg)
105 ట్రిప్ ల ఇసుక స్వాధీనం.
మెట్పల్లి ముద్ర:- మండలంలోని ఆత్మనగర్ గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన ఇసుక డంప్ లపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమంగా నిలువ ఉంచిన ఎనిమిది డంప్ లను గుర్తించి 105 ట్రిప్ ల ఇసుక స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు మైనింగ్ అధికారి గిర్థవర్ నిర్మల తెలిపారు.మండల గిర్ధవర్ ఉమేష్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.