దోషులను శిక్షించాలి- మంత్రి ఎర్రబెల్లి

దోషులను శిక్షించాలి- మంత్రి ఎర్రబెల్లి

ముద్ర ప్రతినిధి, వరంగల్: వరంగల్, కేఎంసి పీజీ అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యాయత్నం పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జరిగిన ఘటన పై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి, చికిత్స పొందుతున్న ప్రీతి కి మంచి వైద్యం అందించాలని సూచించారు. ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ రంగనాథ్ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు.