అవకాశాలే హద్దుగా సాగాలి. పోటీపడితే దక్కని అవకాశం లేదు..
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విద్యార్థులు సృజనతో ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రపంచంతో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరని చెప్పారు. కంప్యూటర్లే మానవ మేథస్సును అధ్యయనం చేస్తున్నాయన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడిరచారు. విద్యాలయాలను పరిశ్రమలతో అనుసంధానించాలని సూచించారు. వర్సిటీలు డిజైనింగ్ కోర్సులకు రూపకల్పన చేయాలన్నారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. ఆర్జీయూకేటీలో 2,200 మంది విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేస్తున్నామని అన్నారు. పీ1, పీ2లో 1500 మంది విద్యార్థుకు డెస్క్టాప్లు అందిస్తున్నామని చెప్పారు. ఆర్జీయూకేటీలో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని చెప్పారు. టీహబ్తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడిరచారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ పంపింది హైదరాబాద్ టీ హబ్ కంపెనీయేనని గుర్తుచేశారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని చెప్పారు. ఔత్సాహికులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ విద్యాసంస్థలతో ప్రపంచ స్థాయి సంస్థలు ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని తెలిపారు. అమెజాన్ లాంటి కంపెనీలు మన పిల్లలకు అత్యధిక జీతాలు ఇస్తున్నాయని చెప్పారు. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
యూనివర్సిటీలో ఉన్న చెరువును బాగుచేయించే బాధ్యత తనదన్నారు. మిషన్ భగీరథ ద్వారా రక్షిత మంచినీళ్లు క్యాంపస్కు రావాలన్నారు. సైన్స్ బ్లాక్ ఏర్పాటుకు రూ.5 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రత్యేక దవాఖాన ఏర్పాటు చేస్తామన్నారు. ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నారు. బాసర ఆర్జీయూకేటీ అధికారులపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ఏమైనా అంతరిక్ష సమస్యా అని నిలదీశారు. గతంలో తామిచ్చిన హావిూల అమలు ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జీయూకేటీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. గత పర్యటన సందర్భంగా తామిచ్చిన హావిూలు పురోగతిపై మంత్రి కేటీఆర్ అధికారులతో చర్చించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. మెస్ కాంట్రాక్టర్ను ఇంకా ఎందుకు మార్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే పోలీసుల సాయం తీసుకోవాలని సూచించారు. ట్రిపుల్ ఐటీకి సీఎం కేసీఆర్ అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు.అంతకుముందు విద్యార్థులకు ల్యాప్టాప్లు, యూనిఫాంలు అందజేశారు. హాస్టల్ బిల్డింగ్పై సోలార్ ప్లాంటును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అదేవిధంగా మంత్రుల సమక్షంలో టీహబ్ ప్రతినిధులు ఆర్జీయూకేటీ అధికారులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. ఇకపోతే బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, సానిటేషన్ విషయంలో ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మిషన్ భగీరథ ద్వారా యూనివర్సిటీకి స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తామన్నారు. క్యాంపస్ లో ప్రత్యేకంగా సోలార్ పవర్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. అలాగే బాసర ట్రిపుల్ ఐటీలో 70 శాతం మంది అమ్మాయిలే చదువుతున్నారని..వారి కోసం 10 పడకల డెడికేటెడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అటు సైన్స్ బ్లాక్ కోసం రూ. 5 కోట్లతో ఏర్పాటు చేస్తామని..ఇక్కడి చెరువును సుందరీకరిస్తామని మంత్రి కేటీఆర్ హావిూ ఇచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ అభివృద్ధికి రూ. 27 కోట్లు మంజూరు చేశామని వెల్లడిరచారు. బాసర ట్రిపుల్ నిర్వహించిన స్నాతకోత్సవం మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. పలు గ్రూపుల్లో టాపర్ గా నిలిచిన విద్యార్థులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిలతో కలిసి డిగ్రీ పట్టాలు అందజేశారు.