సాయి చందు  మృతి పట్ల దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంతాపం 

సాయి చందు  మృతి పట్ల దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంతాపం 

దుబ్బాక, ముద్ర: తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు మృతి పట్ల  భాజపా నేత, దుబ్బాక శాసనసభ్యుడు మాధవనేని రఘునందన్ రావు సంతాపం తెలిపారు. గురువారం నాడు దుబ్బాకలో ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ సాయి చందు మృతి చెందడం బాధాకరమని, తెలంగాణ ఉద్యమంలో తను ఎన్నో పాటలు పాడారు అని గుర్తు చేస్తూ వారి కుటుంబ సభ్యులకు  ప్రగాఢ సంతాపం తెలిపారు.