కొండగట్టులో సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్- ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

కొండగట్టులో సస్పెన్స్ థ్రిల్లర్ షూటింగ్- ప్రారంభించిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ 

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధిలో బుధవారం ఓ క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రారంభించారు. జమ్మికుంటకు చెందిన దర్శకుడు గౌతమ్ కృష్ణ, నిర్మాత సతీష్ లు అమ్మ బ్యానర్ లో నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ముహూర్తం కొండగట్టులో చేపట్టగా,  ఎమ్మెల్యే క్లాప్ కొట్టి ప్రారంభించారు. ఈ సినిమాలో ఎమ్మెల్యే తనయుడు సుంకె దీక్షిత్ ఏసీపీ క్యారెక్టర్ లో హీరో, హైదరాబాద్ కి చెందిన నవ్యశ్రీనివాస్ హీరోయిన్ గా చేస్తున్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే రవిశంకర్ కుటుంబ సభ్యులతో పాటు, సినిమా యూనిట్ సభ్యులoదరూ.. అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి సుదర్శన్, జనగాం శ్రీనివాస్, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, సూపరిoడేoట్ సునీల్, మాజీ డైరెక్టర్ కొంక నర్షయ్య, తదితరులు పాల్గొన్నారు.
 తెలంగాణ వచ్చాక సినిమా రంగానికి ప్రోత్సహం.
తెలంగాణ ఏర్పడి, కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక సినిమా రంగానికి ప్రోత్సహం కల్పించడం జరుగుతుందని ఎమ్మెల్యే రవిశంకర్ పేర్కొన్నారు. ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం ఆంధ్ర ప్రాంతంకు చెందినవారే కళాకారులు ఎక్కువగా ఉండేవారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహంతో ఏంతో మంది గ్రామీణ ప్రాంతాల నుంచి సైతం కమెడీయన్లు, హీరో, హీరోయిన్స్ బయటకు వస్తున్నారని అన్నారు. ఇటీవల 'బలగం', తదితర చిన్న సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొoదడం నిదర్శనం అన్నారు.