అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

అంజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దర్శించుకున్నారు. ఆయన జన్మదినo సందర్బంగా ఉదయం స్వామివారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఎమ్మెల్యేను సత్కరించగా, అర్చకులు ఆశీర్వదిoచి స్వామివారి తీర్థప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్, జడ్పీటీసీ రామ్మోహన్ రావు, సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, నాయకులు కోటేశ్వర్ రావు, నగేష్, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.