కొండగట్టు అంజన్న సేవలో.. ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు అంజన్న సేవలో.. ఎమ్మెల్సీ కవిత
  • వేకువజామునే అంజన్న దర్శనo..
  • గంటసేపు స్వామివారి సేవలో.. తరించిన కవిత
  • స్వామివార్లకు, అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు...

ముద్ర, మల్యాల: కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. వేకువజామున 5 గంటలకు కొండపైకి చేరుకున్న కవిత ఆలయoలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివార్లతో పాటు, అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు జితేంద్ర ప్రసాద్, ఉప ప్రధానార్చకులు చిరంజీవి, స్థానిక ఎస్ ఐ చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.

అంజన్న రక్ష కోరుతూ...
ప్రస్తుత ఈడీ విచారణ నేపథ్యంలో.. కవిత కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం స్థానికంగా చర్చనీయంశమైంది.  అంజన్న రక్ష కోరుతూ దర్శనానికి వచ్చినట్లు పలువురు చర్చించుకున్నారు. ఇది ఇలా ఉండగా, అటు ఆలయ అధికారులకు, ఇటు స్థానిక ఎమ్మెల్యేతో పాటు, పార్టీ నాయకులు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా రహస్యంగా ఒక్కరే దర్శనం చేసుకోవడం గమనార్హం. కవిత సమాచారం ఇవ్వకపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేశారు.