ప్రజాదరణలో ప్రపంచంలోనే అగ్రగామి నరేంద్రమోదీ - కేంద్ర మంత్రి పరుషోత్తం 

ప్రజాదరణలో ప్రపంచంలోనే అగ్రగామి నరేంద్రమోదీ - కేంద్ర మంత్రి పరుషోత్తం 

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ప్రపంచంలో నే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో  దేశ ప్రధాని నరేంద్రమోదీ అగ్రస్థానంలో నిలిచారని కేంద్ర మంత్రి పరుషోత్తం రూపాల కొనియాడారు. మహాజన్ సంపర్క్ అభియాన్ లో భాగంగా శుక్రవారం శ్రీనివాస టాకీస్ రోడ్ లో వ్యాపారులు, ప్రజలను ఆయన కలుసుకున్నారు. నరేంద్రమోదీ విశ్వవ్యాపితంగా ఎంతో ఖ్యాతి గడించారని అన్నారు. అమెరికా దేశాధ్యక్షుడు ఎంత ఆదరణ పూర్వకంగా స్వాగతం పలికాడో అందుకు నిదర్శనమని తెలిపారు. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తొమ్మిదేళ్లలో దేశంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువచ్చారని గుర్తు చేస్తు ప్రజలకు కరపత్రాల ద్వారా వివరించారు. మోడీ పాలనపై ప్రజలు సంతుష్టి గా ఉన్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా మోడీ సారధ్యంలోనే బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో బీజేపీ జిల్లా ఇంచార్జి గంగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ రావు ఇతర నేతలు పాల్గొన్నారు.