ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు...!

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న విద్యార్థులు...!
  • రోడ్డు వెడల్పు లేక ఇబ్బందులు పడుతున్న వాహన దారులు

ముద్ర నడిగూడెం:-ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పాఠశాలలకు వెళ్తున్న సంఘటన మండల కేంద్రం లోని చాకిరాల గ్రామ శివారు లోని సాగర్ ఎడమ కాల్వ దగ్గర నిత్యం కనిపిస్తుంది. మండలం కేంద్రం లోని ప్రెవేట్ పాఠశాలల బస్సు లు, కరివిరాల గ్రామం లోని మోడల్ స్కూల్ కు వెళ్లే ఆర్టీసి బస్సు లలో నిత్యం వందల సంఖ్యలో విద్యార్థుల ప్రయాణం చేస్తుంటారు.సాగర్ ఎడమ కాల్వ బ్రిడ్జి కి ఇరువైపులా  300 మీటర్ల వరకు రోడ్డు ఇరుకుగా ఉండటం తో పాటు మూల మలుపు లు ఉండటం తో ఎదురుగా ఏ వాహనం వచ్చిన రోడ్డు క్రిందకు దిగాల్సిందే అలాంటి సమయం లో  డ్రైవర్లు నిర్లక్ష్యం గా వాహనం నడిపితే విద్యార్థుల ప్రాణాలు గాలి లో కలిసి పోవాల్సిందే...ఇప్పటికైనా ఆర్అండ్ బి అధికారులు స్పందించి ఎలాంటి పెను ప్రమాదాలు జరగకముందే రోడ్డు వెడల్పు చేయాలని  విద్యార్థుల తల్లిదండ్రులు, వాహన దారులు,ప్రజలు కోరుకుంటున్నారు. అధికారులు స్పందిస్తారా..? పోయే ప్రాణాలు మావి కాదు అనుకోని పట్టించుకోకుంట ఉంటారా చూడాలి మరి..!