కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ | Mudra Tv

కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీపీ | Mudra Tv

ముద్ర ప్రతినిధి,  వనపర్తి: పానుగల్ మండలంలోని కేతేపల్లి గ్రామంలో కంటి వెలుగు కేంద్రాన్ని ఎంపీపీ మామిల్లపల్లి శ్రీధర్ రెడ్డి, రైతు బంధు మండల కో ఆర్డినేటర్ వెంకటయ్య నాయుడు, ఎంపిడిఓ నాగేశ్వర్ రెడ్డి,, ఎస్ఐ నాగన్న , సర్పంచ్ అనిత శ్రీనివాస్ రెడ్డి, ఎంపిటిసి శ్యామల హనుమంతు రెడ్డిలు ప్రారంభించారు. కంటి వెలుగు కేంద్రాలను గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంకరమ్మ, సింగిల్ విండో డైరెక్టర్ జైపాల్ రెడ్డి, మాజీ డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి, పంచాయితీ కార్యదర్శి హరిత, BRS పార్టీ నాయకులు , PHC సిబ్బంది పాల్గొన్నారు.