సమస్యల పరిష్కారం కు ఎమ్మెల్యే భరోసా

సమస్యల పరిష్కారం కు ఎమ్మెల్యే భరోసా
మంచిర్యాల గోపాల్ వాడలో సమస్యలు పరిష్కరిస్తానని భరోసా ఇస్తున్న ఎమ్మెల్యే

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల :  మున్సిపల్ పరిధిలోని గోపాల్ వాడలో 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్ పనులను ఎమ్మెల్యే నడిపెళ్లి దివాకర్ రావు ప్రారంభించారు. సోమవారం మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యతో కలిసి రోడ్ పనులను ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, టూ టౌన్ ప్రాంతం అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. రహదారులు, మురికి కాలువల నిర్మాణం కు 10 కోట్లు కేటాయించిన ట్లు చెప్పారు. రైల్వే అండర్ బ్రిడ్జి  నిర్మాణం వల్ల వన్ టౌన్, టూ టౌన్ ప్రజలకు రాకపోకలకు మార్గం సుగమం అయ్యిందని అన్నారు. గోపాల్ వాడలో రోడ్, మురికి కాలువలు నిర్మించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సల్ల మహేష్, మాజీ కౌన్సిలర్  శ్రీపతి వాసు తదితరులు పాల్గొన్నారు.