ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ రూ. 100 కోట్ల జరిమానా
ఏపీ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) భారీ జరిమానా విధించింది. రూ. 100 కోట్ల జరిమానా విధించిన ఎన్జీటీ. చిత్తూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటీ సీరియస్ అయింది. ఆవులపల్లి, ముదివీడు, నేతిగుంటపల్లి రిజర్వాయర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని ఏపీ సర్కారుకు ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చింది. పర్యావరణ అనుమతులనూ రద్దు చేసింది. 3 రిజర్వాయర్లను ఒకే జీవో కింద చేపట్టి తాగునీటి కోసమని మొదటి వాదించిన ప్రభుత్వం. 3 ప్రాజెక్టులను విడగొట్టి ఆవులపల్లి రిజర్వాయర్కు మాత్రమే పర్యావరణ ఈనుమతి తీసుకున్న ప్రభుత్వం. పర్యావరణ ఫైల్స్లోనూ ఫ్యాబ్రికేట్ చేశారని ఎన్జీటీ చెప్పింది.