ఎన్ని ఆటంకాలు కల్పించినా నీటి సరఫరా చేశా

ఎన్ని ఆటంకాలు కల్పించినా నీటి సరఫరా చేశా
  • మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : అధికార పక్షం ఎన్ని ఆటంకాలు కల్పించినా సొంత ఖర్చుతో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశానని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. మండు వేసవిలో 64 రోజుల పాటు సరఫరా చేసిన నీటి పథకం ముగింపు సందర్భంగా చివరి రోజు ఆదివారం స్వయంగా నీటి సరఫరా చేశారు. ఈసందర్భంగా ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, వేసవిలో తాగునీటి ఎద్దడి ప్రాంతాల్లో ట్యాంకర్ల తో నీళ్లు సరఫరా చేశానని చెప్పారు. గోదావరి పక్కన బోర్ వేసి తొలిసారి 6 ట్యాంకర్లతో కార్మిక కాలనీలో నీరు అందించనని అన్నారు. తన ప్రయత్నాన్ని అధికార పక్షం అడ్డగించడానికి శత విధాలుగా ఆటంకాలు సృష్టించిందని తెలిపారు. ప్రజలకు తాగునీరు అందించడమే లక్ష్యంగా ఆరు ట్యాంకర్ల స్థానంలో అదనంగా మరో ఆరు ట్యాంకర్లను అందుబాటులో కి తీసుకువచ్చానని తెలిపారు. మంచిర్యాల, నస్పూర్ పురపాలక సంఘాల్లో నీటి సమస్య లేకుండా తన వంతు ప్రయత్నం చేశానని అన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఇంటింటికీ తాగునీరు సరఫరా చేసి ట్యాంకర్ల అవసరం లేకుండా చేస్తానని  హామీ ఇచ్చారు. చివరి రోజు నీటి సరఫరా చేస్తున్న ప్రేమ్ సాగర్ రావు.