గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఒక రోజుసమ్మె

గ్రామీణ పోస్టల్ ఉద్యోగుల ఒక రోజుసమ్మె

ముద్ర ,వెంకటాపురం( నూ): ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని ఉప తపాలా కార్యాలయం గ్రామీణ పోస్టల్ ఉద్యోగులు (జి. డి. ఎస్) బుధ వారం నాడు ఒక రోజు సామూహికంగా " యన్. యు.జి. డి. ఎస్. యు. యూనియన్ అద్వర్యంలో సమ్మెను చేపట్టారు..

సదరు గ్రామీణ తపాలా ఉద్యోగులు వివిధ డిమాండ్ల పరిష్కారానికై సమ్మె చేపట్టారు. 8 గంటలు పని,పెన్షన్, ఇంక్రిమెంట్లు, గ్రాట్యుటీ....తదితర సమస్యలు  పరిష్కారానికి శాంతియుత సమ్మెను చేపట్టారు. వారి డిమాండ్ల పరిష్కారానికి, నిరసన వ్యక్తం చేస్తూ విధులను బహిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సబ్ ఆఫీస్ పరిధిలోని 17 బ్రాంచి తపాలా కార్యాలయము  ల సదరు బిపియం లు, ఎబిపియం లు పాల్గొన్నారు.