పరవళ్ళు తొక్కుతున్న మూసీ

పరవళ్ళు తొక్కుతున్న మూసీ

భూదాన్ పోచంపల్లి, జూలై 21, ముద్ర న్యూస్: అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూసీనది పరవళ్ళు తొక్కుతుంది. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జూలూరు- రుద్రవెల్లి గ్రామాల మధ్య గల లోలెవెల్ బ్రిడ్జి పై నుండి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వాహనాలు రాకుండా ముందస్తుగా అధికారులు బ్రిడ్జి సమీపంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. మూసీ నదిపై వరద ఉప్పొంగడంతో పోచంపల్లి -బీబీనగర్ కు రవాణా సదుపాయం నిలిచిపోయింది. దీంతో బీబీనగర్ ఇటు భువనగిరి వెళ్లడానికి వయా పెద్ద రావులపల్లి నుంచి దారి మళ్లించారు. అలాగే మండలంలోని చెరువులు  నిండుకుని జలకళను సంతరించుకుంటున్నాయి.