సీఎం చిత్రపటానికి పాలభిషేఖం

సీఎం చిత్రపటానికి పాలభిషేఖం

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగులకు వెయ్యి రూపాయల పింఛన్ పెంచడాన్ని హర్షిస్తూ ఆయన చిత్రపటానికి  దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. శనివారం మంచిర్యాల ఐబి చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మంచిర్యాల వచ్చిన సందర్భంగా వెయ్యి రూపాయల పింఛన్ పెంచుతు ప్రకటన చేయడం సంతోషదాయకమని అన్నారు. 3,116 ఉన్న పింఛన్  వెయ్యి పెంచడంతో 4,116కు పెరిగిందని వారు తెలిపారు. దివ్యాంగుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కున్న ప్రేమను ఎప్పుడూ మర్చిపోమని అన్నారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ తాజుద్దీన్ ,మహేందర్, లక్ష్మణ్, రమేష్ ,రాజన్న, ప్రభాకర్, కనకయ్య పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న దృశ్యం