సీఎం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ చిత్రపటాలకు క్షిరాభిషేకం

సీఎం, ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ చిత్రపటాలకు క్షిరాభిషేకం

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో మున్నూరుకాపు సంఘం అధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు వొడ్నాల రాజశేఖర్, హరిఅశోక్ కుమార్ మాట్లాడుతూ మా ప్రభుత్వం వస్తే మున్నూరుకాపు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి వంద రోజుల్లోనే కార్పొరేషన్ సహకరించిన మంత్రి వర్గానికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బండారి రాజ్ కుమార్, దీటి అంజయ్య పటేల్, వొడ్నాల రాజశేఖర్, హరిఅశోక్ కుమార్, చిట్ల అంజన్న,ఆడప గంగన్న,అంగలి రాజన్న,సిరిపురం రాజేశం,చిట్ల రవి, ముసిపట్ల లక్షినారాయణ, ఆకుల నాగరాజు,  బండారి విజయ్,తోట నరేష్, గోపు రాజేష్, జంగిలి చంద్రమౌళి,గంగం జలజ,జంగిలి రవికుమార్, అదుముల్ల నరేందర్,బాస మహేష్, ముస్కే శ్రీనివాస్,జంగిలి ధర్మేందర్, చెవుల గంగన్న,పిట్ట రాజన్న, మంగి రవి ,వొడ్నాల జగన్, జంగిలి రామానంద,తదితరులు పాల్గొన్నారు.