సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన వీఆర్ఏలు.
![సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన వీఆర్ఏలు.](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64bfad1ec0cef.jpg)
సారంగాపూర్ ముద్ర:రాష్ట్రంలో రెవిన్యూ డిపార్ట్మెంట్లో గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తున్న వీఆర్ఏల అందరిని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రెగ్యులర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా సారంగాపూర్ మండలంలో పనిచేస్తున్న వీఆర్ఏలు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు.ఈ సందర్భంగా వి ఆర్ లు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు పంగ రాజేశం, ఇబ్రహీం, రెంటం వెంకటేష్,ఎండబెట్ల రాజరత్నం, సౌజన్య, నరసయ్య, వజ్ర తదితరులు పాల్గొన్నారు.