కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర, లక్షేట్టిపేట :ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర రైతాంగానికి లక్ష రూపాయల ఋణ మాఫీ ప్రకటించడాన్ని హర్షిస్తూ గురువారం పట్టణ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి అంబేద్కర్ చౌరస్తా వద్ద పాలాభిషేకం చేసి, టపాకాయలు కాల్చారు.మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్బంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. కేసీఆర్ అందరి బంధువని, రైతుల పక్షపాతి అని కొనియాడారు.   దేశానికి ఆదర్శంగా కేసీఆర్ పాలన ఉండటం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రజల కన్నీటి విలువ తెలిసిన బీఆర్ఎస్ పార్టీ ని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ గెలిపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పాదం శ్రీనివాస్ , మండలాధ్యక్షుడు చుంచు చిన్నయ్య, కౌన్సిలర్లు, పార్టీ కార్యకర్తలు, మండల ఉపాధ్యక్షుడు అంకతి రమేష్,గ్రామ సర్పంచ్ చుంచు రవి,ఎంపిటిసి గడుసు స్వప్న-రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎంబడి భూమయ్య,గ్రామ యూత్ అధ్యక్షుడు నెరేళ్ల సురేష్,మాజీ సర్పంచ్ బియ్యల సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.