ఘనంగా జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఘనంగా జనసేన చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన జనసేన నాయకులు

ముద్ర, షాద్‌నగర్ : దేశంలోనే జీరో పాలిటిక్స్ చేస్తున్నా ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అని జనసేన పార్టీ  ఇంచార్జ్ రాజునాయక్, సీనియర్ నాయకులు అష్రాఫ్ అన్నారు.

 శనివారం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లో జనసేన ఇంచార్జ్ రాజు నాయక్, సీనియర్ నాయకులు అష్రాఫ్ ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు, కార్యకర్తలకు పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు సుమారు 60 మంది రక్త దానం చేశారు. 

ఈ సందర్భంగా రాజు నాయక్, అష్రాఫ్ మాట్లాడుతూ అధినేత పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్దిలలని అన్నారు. వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం పక్క అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ లో అధినేత  అభ్యర్థులు ను ఎక్కడ నిలబెట్టిన అక్కడకు వెళ్లి కలికట్టుగా పనిచేస్తామన్నారు. అధినేత ఆదేశిస్తే షాద్ నగలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. 

ఈ కార్యక్రమంలో శివా జానీ,చరణ్,మహేష్,, స్పందన, శ్రీనివాస్, రాఘవేంద్రర్, శివగాళ్ల శ్రీశైలం, నరేష్ నాయక్, రాజు యాదవ్, శివ, హేమంత్, చందు, జగన్ నాయక్, మాధవ పటేల్,S. శ్రీను,M. నాగరాజు, c.యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.