బీసీ సహాయానిది లో పెఱిక కులస్తులను చేర్చాలి

బీసీ సహాయానిది లో పెఱిక కులస్తులను చేర్చాలి
  • పెఱిక సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్

ముద్ర, లక్షేట్టిపేట :తెలంగాణ లో ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో కులాల పేరుతో కొన్నిటిని వేరు చేసే విందంగా కెసిఆర్ పనితీరుపై పెఱిక సంఘం యువజన జిల్లా అధ్యక్షుడు అంకతి శ్రీనివాస్ మండిపడ్డారు. శుక్రవారం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీలో స్థానిక విశ్రాంతి భవనంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  కొత్తగా కెసిఆర్ బీసీ లోని 15 కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం గురించి దరఖాస్తు చేసుకోవాలని ఆహ్వానించారు. కానీ దరఖాస్తు చేసుకోవడానికి పెఱిక కులస్తులతో పాటు యాదవ్, గౌడ్స్, మున్నూరుకాపు, బెస్త, పద్మశాలి, యాదవ కుల వారికి కూడా అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో రాందేని చిన్న వెంకటేష్, పెఱిక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.