కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశలకు పోయి ఆగం కాకండి ఆలోచించండి

కాంగ్రెస్ పార్టీలో చేరి ఆశలకు పోయి ఆగం కాకండి ఆలోచించండి
  • మళ్ళీ ఏర్పడేది బీఅర్ఎస్ ప్రభుత్వమే, తాండూరులో గెలిచేది నేనే..
  • బీఆర్ ఎస్ లో పార్టీలో చేరిన పలువురు కాంగ్రెస్ నాయకులు - ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ముద్ర, ప్రతినిధి వికారాబాద్:  కాంగ్రెస్ పార్టీ గాలిపోయిన బెలూన్ అని తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  విమర్శించారు.  తాండూరులోని ఎమ్మెల్యే నివాసంలో మంగళ వారం 
బషీరాబాద్ మండలం కొర్వి చేడ్ ఘని కాంగ్రెస్ పార్టీ నాయకుడు మహారాష్ట్ర అంబన్న పలువురు యువకులతో కలిసి ఎమ్మెల్యే సమక్షంలో బీఅర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మాట్లాడుతూ నడి సముద్రంలో నావల కాంగ్రెస్ లో చేరుతున్న వారి పరిస్థితి తయారైందని అన్నారు. ఆశలకు పోయి ఆగం కాకుండా ఆలోచించాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలో మళ్ళీ ఏర్పడేది బీఅర్ఎస్ ప్రభుత్వమే అని మళ్ళీ తాండూరులో గెలిచేది నేనే అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, బీఅర్ఎస్ నాయకులు హన్మంతు, శివ, మోతిరాం, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.