సోషల్ మీడియా ఇంచార్జ్ లపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

సోషల్ మీడియా ఇంచార్జ్ లపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు..

మెట్‌పల్లి ముద్ర : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోరుట్ల నియోజకవర్గ ఇంచార్జ్ లు మహ్మద్ నజీర్, ఎడ్ల నవీన్ లపై చట్టరీత్య చర్య తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుతుబోద్దిన్ పాషా. పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో ఎస్సై శ్యాం రాజ్ కు పిర్యాదు చేశారు. మాజీ మంత్రి ప్రస్తుత మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీదర్ బాబు పై అసత్య ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నందుకు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు పాషా తెలిపారు.ఆయన వెంట యూత్ కాంగ్రెస్ నాయకులు కోరే రాజ్ కుమార్, ముద్దం ప్రశాంత్, గణేష్ సింగ్, చోటు, వినోద్, జాదవ్ లు ఉన్నారు.