కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం - ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్

కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం -  ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్
  • ఎమ్మెల్యే వాహనాన్ని తనిఖీసి చేసిన పోలీసులు

కేశంపేట గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుంది అని షాద్ నగర్ ఎమ్మెల్యే విర్లపల్లి శంకర్ అన్నారు.సోమవారం మండల పరిధి లోని కోనాయిపల్లి గ్రామానికి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాపరెడ్డి తో కలిసి ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో వాహనాలను చెక్ పోస్ట్ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.

అనంతరం గ్రామంలో నిర్వహించిన ప్రచారంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం పని చేస్తు,ఢిల్లీకి వారధి అయిన చల్లా వంశీచందర్ రెడ్డిని గెలిపిస్తే నియోజవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేస్తూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూడ వీరేశం, మండల ఇన్చార్జిలు వెంకట్ రామ్ రెడ్డి, ఇబ్రహీం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.