కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము కేంద్రానికి ఉందా... 

కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము కేంద్రానికి ఉందా... 
  • బిఆర్ఎస్ ,బిజెపి, రెండు   ఒక్కటే ..
  • మంత్రి పొన్నం ప్రభాకర్..

ముద్ర, షాద్ నగర్:హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వెళ్తుండగా ఆర్టీసి బస్సులో..నందిగామ నుండి షాద్ నగర్ టోల్ ప్లాజా వరకు ప్రయాణం చేసిన ,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ..బస్సులో ప్రయణిస్తున్న ప్రయాణికులతో ముచ్చటించిన మంత్రి పొన్నం ప్రభాకర్..నారాయణ పెట్ బస్సులో వెళ్తున్న ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి..రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో బీసీ సంక్షేమ శాఖ, రోడ్డు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మహబూబ్నగర్ వెళుతున్న క్రమంలో నందిగామ నుండి షాద్ నగర్ టోల్ ప్లాజా వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. అనంతరం  విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. 

మంత్రి పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన 90 రోజుల్లోనే హామీ ఇచ్చిన 6 గ్యారంటీల్లో చాలా వరకు ప్రజలకు అత్యవసరమయ్యే గ్యారంటీలను అమలు చేశామని, మిగతా గ్యారంటీలను అతి త్వరలోనే అమలు చేస్తామన్నారు.కేంద్ర ప్రభుత్వం బీజేపీ ని వ్యతిరేకించే వారిపై ఈడి కేసులతో భయపెడుతున్న కేంద్రానికి కేసీఆర్ అవినీతి పై విచారణ చేసే దమ్ము లేదన్నారు. బీఆర్ఎస్ బిజెపి రెండు ఒక్కటే అన్నారు. అందుకే బీజేపీ కేసిఆర్ డైరక్షన్ లొనే  రాష్ట్ర అధ్యక్షుడిగా బండి ని మార్చి కిషన్ రెడ్డి ని పెట్టారన్నారు. కేంద్రం తెలంగాణ కు ఎం చేసిందో చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఓట్లు అడగలన్నారు.

కేసీఅర్ కుటుంబం, బీఆర్ఎస్ నాయకులు 2004 లో ఉన్న ఆస్తులు ఎన్ని, 2024 లో ఉన్న ఆస్తులెన్ని లెక్క చెప్పాలన్నారు. నల్గొండ జిల్లాలో సభలో KCR మాట్లాడుతూ.. మెడిగడ్డ బొందలగడ్డ అన్నారు. మమ్మల్ని ఎం పీకడానికి వెళ్లారు అన్నారు. ఇప్పుడు BRS నాయకులు ఎందుకు వెళ్లారు అన్నారు. ఒకప్పుడు మానస పుత్రిక అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు బొందలగడ్డ ఎలా అయ్యిందన్నారు ఈ మీడియా సమావేశంలో షాద్ నగర్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, దేవరకొండ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యుడు శ్యాంసుందర్ రెడ్డి, శివశంకర్ గౌడ్ ,సుదర్శన్ గౌడ్ , బాలరాజు గౌడ్ సీతారాం కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..