నీట్ జాతీయస్థాయి పీజీ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ప్రవల్లిక రెడ్డి..

నీట్ జాతీయస్థాయి పీజీ పరీక్షలో అత్యుత్తమ ర్యాంకు సాధించిన ప్రవల్లిక రెడ్డి..

ముద్ర, కాప్రా: నీట్ జాతీయస్థాయి పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో కాప్రా శ్రీనివాస్ నగర్ ఆఫీసర్స్ కాలనీ కి చెందిన అంబవరం ప్రవల్లిక రెడ్డి అత్యుత్తమ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెకు హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ వైద్య కళాశాలలో పిజి   గైనకాలజి (OBG MS) విభాగంలో మెడికల్ సీట్ లభించింది . ఏ. జగజీవన్ రెడ్డి, గీతాదేవి  దంపతుల కుమార్తె అయిన ప్రవల్లిక రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత మహిళలకు అత్యుత్తమ సేవలు అందిస్తానని తెలిపారు . వైధ్యురాలుగా నిరుపేదలకు సేవలందించాలనేదే నా లక్ష్యమని తెలిపారు .ఉస్మానియా వైద్య కళాశాల అధ్యాపకులు, మా కుటుంబ సభ్యుల సహకారంతో నాకు ఈ అవకాశం దక్కిందని తెలిపారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలోనే ఆమె ఎమ్ బి బి ఎస్ పూర్తిచేసారు. అక్కడే మళ్ళీ పిజి సీట్ రావడం పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు.