ముస్లిం లకు ప్రేమ్ సాగర్ రావు రంజాన్ కానుక

ముస్లిం లకు ప్రేమ్ సాగర్ రావు రంజాన్ కానుక

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : రంజాన్ పర్వదినం పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నిరుపేద ముస్లిం మహిళలకు రంజాన్ కానుకను అందజేశారు. గురువారం హైటెక్ సిటీలోని ప్రేమ్ సాగర్ రావు నివాస గృహం ముందు రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతుల మీదుగా కానుకలను పంపిణీ చేశారు. మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో 3,600 మంది ముస్లిం మహిళలకు చీర, బియ్యం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అందజేశారు. అనంతరం ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, ప్రతి ఏటా రంజాన్ మాసంలో ముస్లీమ్ పేద కుటుంబాలకు రంజాన్ కానుకను ఇస్తున్నట్లు చెప్పారు. కొక్కిరాల రఘుపతి రావు చారిటబుల్ ట్రస్టు ద్వారా పడేండ్లు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు కొండా చంద్రశేఖర్, మున్సిపల్ ప్రతిపక్ష ఉప నాయకుడు మజీద్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పెంట రజిత తదితరులు పాల్గొన్నారు.