ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

రామకృష్ణాపూర్,ముద్ర : పట్టణ  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రాజు అధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా రాజీవ్ చౌక్ చౌరస్తా లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి రఘునాథ్ రెడ్డి, తేజావత్ రాంబాబు, డిసిసి కార్యదర్శి మొట్టె సుధాకర్,లాడెన్,యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.