నేడు బి ఆర్ ఎస్ లో చేరనున్న రమాదేవి - కార్యకర్తలతో తరలిన వాహనాలు

నేడు బి ఆర్ ఎస్ లో చేరనున్న రమాదేవి - కార్యకర్తలతో తరలిన వాహనాలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: బిజెపి టికెట్ ఆశించి భంగపడిన నేపథ్యంలో బిజెపి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రమాదేవి బి ఆర్ ఎస్ లో చేరేందుకు సోమవారం ఉదయం హైదరాబాద్ బయలుదేరారు. తనకు టికెట్ రానందున రాజీనామా చేసినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్సీ, ముథోల్ ఇంఛార్జి పురాణం సతీష్ ఆమెతో మంతనాలు కొనసాగిస్తూ వచ్చారు. ఎట్టకేలకు మంతనాలు ఫలించటంతో ఆమె సోమవారం సాయంత్రం 4 గంటలకు అధికార పార్టీలో చేరనున్నారు.